సంక్రాంతి వేళ పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతితో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీ నేతలే పథకం ప్రకారం హత్య చేయించారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయని.. వందలాది కుటుంబాలు భయంతో వెళ్లిపోయాయని స్థానిక వైసీపీ నేత కాసు మహేష్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.