వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలులో వైసీపీ కార్పొరేటర్లు 20 మంది పార్టీ మారిపోయారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో డిప్యూటీ మేయర్ సహా 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో ఒంగోలు నగరపాలక సంస్థలో వైసీపీకి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఎన్నికలు జరిగిన సమయంలో వైసీపీ నుంచి 41 మంది కార్పొరేటర్లు గెలుపొందగా.. మరో ఇద్దరు స్వతంత్రులు ఆ తర్వాత వారితో జత కలిశారు.