డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేసే సురేష్ అనే వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ స్పందించింది. సురేష్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పేషీలోనే లేరని క్లారిటీ ఇచ్చింది. లేని వ్యక్తిని ఉన్నారంటూ.. అతను అవినీతికి పాల్పడుతున్నారంటూ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని జనసేన ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేసినందుకు వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.