తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అక్రమాల విచారణ రెవెన్యూ అధికారులను కలవరపెడుతోంది. 2021-2025 మధ్య కాలంలో జనగామ, రంగారెడ్డి వంటి కీలక జిల్లాల్లో పనిచేసిన తహసీల్దార్లు ఇప్పుడు ఏసీబీ విచారణకు భయపడుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన లావాదేవీల్లో చలానాల మాయాజాలం, నిబంధనల ఉల్లంఘనలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఆడిటింగ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే పలువురు రైతులకు నోటీసులు జారీ కాగా.. సంక్రాంతి తర్వాత అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.