సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుకు వికారాబాద్ అటవీ శాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతమైన అనంతగిరి ఘాట్ రోడ్డులో కదిలే మహీంద్రా థార్ కారు బోనెట్, టాప్పై కూర్చొని ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేసినందుకు ఆయనపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదైంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టారు. వ్యూస్ కోసం పర్యావరణానికి, ప్రజా భద్రతకు ముప్పు తెస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.