ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు ముఖ్యమైన సూచన చేసింది. శనివారం ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య గంట సమయంలో మీ మొబైల్ ఫోన్లలో బీప్ సౌండ్, మెసేజులు వచ్చే అవకాశం ఉందని.. ఈ విషయంలో కంగారు పడవద్దని సూచించింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు ఈ హెచ్చరిక సందేశాలు పంపుతోందని.. ఇదొక ట్రయల్ అని తెలిపింది. కేవలం టెక్నికల్ పరీక్ష మాత్రమేనని భయాందోళనకు గురి కావొద్దని సూచించింది.