శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు భక్తులకు అక్కడ ఘోర అవమానం జరిగింది. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసు.. అయ్యప్ప స్వాముల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం.. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు.