బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.. 262 కి.మీ. పొడవైన ఈ రహదారికి రూ.17,980 కోట్లు ఖర్చవుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చిత్తూరు నుండి బెంగళూరు, చెన్నైకి కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. ఈ రోడ్డు మీద గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. భవిష్యత్తులో దీన్ని 8 వరుసలుగా విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు..