తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభవార్త చెప్పారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హెల్త్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. నిమ్స్లో పోస్టుల భర్తీ, కొత్త వైద్య పరికరాల ఏర్పాటు గురించి కూడా వెల్లడించారు. రూ.192 కోట్లతో ఎంఆర్ఐ యంత్రాలు, రూ.60 కోట్లతో సీటీ స్కాన్, రూ.32 కోట్లతో లైనాక్ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ఈ వివరాలు వెల్లడించారు.