మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల కోసం రవాణా శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో శాశ్వత బస్టాండ్ నిర్మిస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ప్రకటించారు. జాతర కోసం ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్లో 50 ప్రత్యేక క్యూలైన్లను సిద్ధం చేశారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు 4 వేల ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు, ఇవి ప్రయాణికులను నేరుగా గద్దెల సమీపం వరకు తీసుకెళ్తాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం మేడారం బస్సులకు కూడా వర్తిస్తుంది. అదనంగా.. ములుగులో రూ.5 కోట్లతో బస్టాండ్, ఏటూరునాగారంలో రూ.7 కోట్లతో బస్ డిపో నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.