ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆళయంలోకి రాతి నాగశిలలను తీసుకురావడం కలకలం రేపుతోంది. ఏకంగా ఆలయంలోని పూజలు కూడా నిర్వహించడంతో ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. తమిళనాడుకు చెందిన భక్తులు ఇదంతా చేసినట్లు తేలింది. ఇంత జరుగుతున్నా గమనించకుండా ఉడంటతో.. భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. గుర్తుతెలియని భక్తులు కొందరు.. శివలింగం, నంది ప్రతిమలను ఆలయంలోపల అనధికారికంగా ప్రతిష్ఠించారు. అప్పట్లో ఈ ఘటన కూడా చర్చనీయాంశమైంది.