తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక చర్యలు తీసుకుంటోంది. భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని, అలిపిరి టోల్ గేట్ వద్ద చెకింగ్ పాయింట్ విస్తరించాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. కళ్యాణ కట్ట ఆధునీకరణ, అన్నప్రసాదాల కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు వంటి ఆలోచనలు చేస్తున్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది.