టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ధర్మప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన ఉద్యోగులకు బహుమానం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.అలాగే గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని.. నివేదిక ఆధారంగా సంస్కరణలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.