శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. పది రోజులు ఆ టికెట్లు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

3 months ago 5
శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రద్దు చేసింది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఈ హోమం నిర్వహిస్తోంది టీటీడీ. అయితే వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులు సహకరించాలని కోరింది.
Read Entire Article