శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌పై భారీ డిస్కౌంట్.. 1000 దర్శన టికెట్స్..

9 months ago 10
వినాయక చవితి సందర్భంగా భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటించింది. లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15 శాతం తగ్గింపు లభిస్తుందని పేర్కొంది. ఈ రాయితీలు తిరుపతితో పాటు రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం వంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాలకు కూడా వర్తించనున్నాయి. బస్సు టికెట్‌తో పాటు టిటిడి ప్రత్యేక దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
Read Entire Article