శ్రీవారి సేవలో ప్రభుదేవా.. భార్యా, కూతుర్ని చూశారా?

1 year ago 34
తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు , కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో కుటుంబసభ్యులతో కలసి ప్రభుదేవా స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు ఆలయం వెలుపల ప్రభుదేవాతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి ప్రదర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రభుదేవా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామి దయ అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు..
Read Entire Article