Srisailam Temple Vibhuti Dharana Started:ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తులకు ముఖ్యమైన గమనిక. దాదాపు నాలుగేళ్ల తర్వాత విభూదిధారణను ఆలయ ఈవో పెద్దిరాజు పునఃప్రారంభించారు. ఆలయ క్యూలైన్ వద్ద ఆలయంలోనికి ప్రవేశించే భక్తులకు అధికారులు విభూదిధారణ చేస్తున్నారు. మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తులకు విభూదిధారణ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గతంలో విభూదిధారణను అధికారులు నిలిపివేశారు. భక్తులు ఇకపై విభూదిదారణ చేసి స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లాలని సూచించారు ఈవో.