శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 54,865 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.267 టీఎంసీల నీరు ఉంది. కాలువలు, ఎత్తిపోతలు, విద్యుదుత్పాదనకు 48,765 క్యూసెక్కుల నీటిని వినియోగించారు. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్లు కూడా 97 శాతం నిండిపోయాయి. శ్రీశైలం జలాశయం నుంచి త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.