మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని డాలర్ మెడోస్ కాలనీ నివాసితులు పౌర చైతన్యానికి నిదర్శనంగా నిలిచారు. తమ లేఅవుట్ రహదారిని ఆక్రమించి ప్రహరీ నిర్మించిన వ్యక్తిపై వారు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో ఆ ఆక్రమణలను తొలగించి, రోడ్డును పునరుద్ధరించారు. ఇందుకు కృతజ్ఞతగా కమిషనర్ను సన్మానించేందుకు వెళ్లిన కాలనీవాసులకు అనూహ్య గౌరవం లభించింది. తనను సన్మానించడం కంటే.. అక్రమాలపై పోరాడిన ప్రజలనే గౌరవించాలని భావించిన రంగనాథ్ వారిని శాలువాలతో సత్కరించారు.