సంక్రాంతి పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే వారి రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి నగరానికి వచ్చే ప్రయాణికుల కోసం సుమారు 1200 ప్రత్యేక బస్సులను కేటాయించింది. ఆదివారం రద్దీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.