అన్నమయ్య జిల్లా కేవీ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. సంక్రాంతి పండుగకు ఊరికి వచ్చిన మణి, పుష్పరాజ్ అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. మరో నలుగురు స్నేహితులతో కలిసి మద్యం సేవించడానికి శివారు ప్రాంతానికి వెళ్లారు. మద్యం సేవించిన తర్వాత మణి, పుష్పరాజ్ అస్వస్థతకు గురికాగా.. పక్కనున్న వారు పీలేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ చనిపోగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.