సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అందరికీ ఆరోగ్య రికార్డులు తయారు చేస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే.. సంపదకు విలువ పెరుగుతుందని సీఎం చెప్పారు. కాగా, సంజీవని పథకం కింద ప్రజలకు రూ. 2.50 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందుతాయి. ఈ పరిమితి దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్యం అందిస్తారు.