తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు రూ. 50 కోట్ల విలువైన సహాయక ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా లేదా ఇతరులు వారిని పెళ్లి చేసుకున్నా రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వయోవృద్ధుల కోసం 'ప్రణామ్' డే కేర్ సెంటర్లు, పిల్లల కోసం 'బాల భరోసా' పథకాలను ప్రారంభించారు.