సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారికి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకునే దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు.