సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దొరకక ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. సామాన్యులు ప్రయాణ ఖర్చులకే అల్లాడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రైవేట్ బస్సుల ధరలపై నియంత్రణ విధించాలని ప్రయాణికులు కోరుతున్నారు.