సంక్రాంతి వేళ హైదరాబాద్లో చైనా మాంజా వాడకంపై పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఇది పక్షులకే కాదు, మనుషులకు కూడా ప్రాణాంతకమని.. ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలు, మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. చైనా మాంజా అమ్మకాలు, వాడకంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.