సంగారెడ్డి జిల్లా పర్వతపూర్లో అరుదైన ఖనిజాలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించారు. లభ్యమైన 15.25 మిలియన్ టన్నుల వనేడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలను కేంద్రం వేలం వేస్తోంది. రక్షణ, స్టీల్, బ్యాటరీ పరిశ్రమలకు కీలకమైన ఈ ఖనిజాలపై పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్లో రోడ్షో నిర్వహిస్తున్నారు. జహీరాబాద్కు సమీపంలో ఉన్న ఈ బ్లాక్.. వ్యూహాత్మక ఖనిజాల వెలికితీతలో కీలకంగా మారనుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు సైతం కల్పించనుంది.