కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం షోకాజు నోటీసులు జారీ చేసింది. కాగా, సాంకేతిక, సమన్వయ లోపాల వల్ల కొందరికి అన్యాయం జరిగిందని, బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన వారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నోటీసులను పునఃపరిశీలించాలని వారు కోరుతున్నారు.