తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 14వ తేదీననే వీరి పదవీకాలం ముగిసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇకపై వీరికి అధికారిక హోదా ఉండదని తెలిపింది. ఇక్కడ కలెక్టర్లు బాధ్యత వహించనున్నారు. ఈ చర్యతో సహకార రంగంలో కొత్త పాలనా ఏర్పాట్లకు మార్గం సుగమమవుతుందని అధికారులు పేర్కొన్నారు.