Kadapa Vijaya Kumari Death Controversy: కడపలో సచివాలయ ఉద్యోగి విజయకుమారి మృతిపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. అధికారుల ఒత్తిడితో కాకుండా, ఆమె గత ఆరేళ్లుగా గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని, వైద్యుల సూచనల మేరకు ఇంటికి దగ్గరగా బదిలీ చేశారని వివరించింది. విజయ కుమారి అనారోగ్యంతోనే మరణించారని, తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. ఈ నెల 18న విజయ కుమారి ప్రాణాలు కోల్పోయారు.