సత్యసాయి శత జయంతి వేడుకలు.. ప్రభుత్వం నిర్వహిస్తే తప్పేంటి.. హైకోర్టు వార్నింగ్

7 months ago 16
పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లౌకిక దేశంలో మతపరమైన వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై పటిషనర్ అభ్యంతరం తెలిపారు. అయితే సత్యసాయి ట్రస్ట్ చేసిన ప్రజా సేవలను పరిగణనలోకి తీసుకుని గౌరవించడంలో తప్పేముందని సూటిగా ప్రశ్నించింది. పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని లేదంటే ఖర్చులు విధిస్తూ.. వ్యాజ్యాన్ని కొట్టివేస్తామని వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు.
Read Entire Article