తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో పంపిణీ శాతం గణనీయంగా పెరిగింది. గతంలో దొడ్డు బియ్యానికి అంతగా ఆదరణ లేకపోవడంతో అక్రమ రవాణా జరిగేది, కానీ సన్నబియ్యం పంపిణీతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని అధికారులు చెబుతున్నారు.