హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి డిమాండ్పై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మణికొండ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో పెరిగిన ట్యాంకర్ పెండెన్సీని తగ్గించడానికి రాత్రి వేళల్లో సరఫరా పెంచాలని సూచించారు. ట్యాంకర్లు బుక్ చేసిన 12 గంటల్లోపే డెలివరీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీ నాటికే సుమారు 95 వేల ట్రిప్పులు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రతి పౌరుడు కనీసం 20 శాతం నీటిని ఆదా చేయాలని, నీటి వృధాను అరికట్టాలని నగరవాసులను ఆయన విజ్ఞప్తి చేశారు.