Bhogi bonfires: సంక్రాంతి సందడి మొదలైంది. అయితే, విశాఖపట్నంలో భోగి మంటలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై భోగి మంటలు వేయరాదని, పర్యావరణాన్ని కాపాడటమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యమని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. పాత టైర్లు, కాలుష్యం కలిగించే వస్తువులతో మంటలు వేయవద్దని సూచిస్తూ, బహిరంగ ప్రదేశాల్లోనే మంటలు వేయాలని కోరారు. ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా జీవీఎంసీతో సహకరించాలని కోరారు.