తెలంగాణ సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. ఇక నుంచి రుచికరమైన భోజనం అందనుంది. మార్చి 1 నుంచి అన్ని సర్కార్ బడుల్లో స్టీమ్ రైస్ సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తున్నా.. అన్నం ముద్దగా మారి తినటానికి ఇబ్బందిగా ఉంది. స్టీమ్ రైస్ పొడిపొడిగా ఉండి విద్యార్థులకు తినేందుకు వీలుగా ఉంటుంది అధికారులు చెబుతున్నారు.