తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల వివాదంతో నిలిచిపోయాయి. హైకోర్టు తీర్పుపైనే ఎన్నికల షెడ్యూల్ ఆధారపడి ఉంది. నవంబర్ 3న కీలక విచారణ జరగనుంది. కోర్టు తీర్పును బట్టి 42 శాతం లేదా 23 శాతం బీసీ కోటాతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతు భరోసా పథకం అమలుపై కూడా దృష్టి సారించింది.