తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం గతేడాది ముగియగా... హైకోర్టు తాజాగా సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది.