తెలంగాణలో త్వరలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల నిర్వహణకు సమగ్ర ప్రణాళికను విడుదల చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ నెల 23వ తేదీ లోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.