తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విద్యావంతుల అరంగేట్రం ఆసక్తికరంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, తన హైఫై ఉద్యోగాన్ని వదిలి కుటుంబ ప్రజాసేవ వారసత్వాన్ని కొనసాగిస్తూ గ్రామాభివృద్ధికి నడుం బిగించారు. రిజర్వేషన్లు అనుకూలించకపోయినా.. రాజకీయ చతురతతో తన అనుచరుడిని సర్పంచ్గా గెలిపించి, తాను ఉపసర్పంచ్గా ఎన్నికయ్యాడు.