సామాన్య భక్తులకు భారీ ఊరట.. దుర్గగుడిలో ఆ సమయంలో వీఐపీ దర్శనాలు బంద్!

1 year ago 35
విజయవాడ దుర్గగుడిలో ప్రముఖుల దర్శన వేళల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ప్రోటోకాల్ దర్శనాలు ఉండబోవని ఆలయ ఈఓ తెలిపారు. అమ్మవారికి నైవేద్య సమయంలో సాధారణ భక్తులకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ మార్పుల వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అయితే, భక్తుల సౌకర్యార్థం దుర్గగుడి తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి!
Read Entire Article