విజయవాడ దుర్గగుడిలో ప్రముఖుల దర్శన వేళల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ప్రోటోకాల్ దర్శనాలు ఉండబోవని ఆలయ ఈఓ తెలిపారు. అమ్మవారికి నైవేద్య సమయంలో సాధారణ భక్తులకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ మార్పుల వల్ల సామాన్యులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అయితే, భక్తుల సౌకర్యార్థం దుర్గగుడి తీసుకున్న ఈ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి!