మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని కొత్త మోసాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. ఆపదలో ఉన్న మహిళల పేరు చెప్పి.. మీ ప్రాంతం వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెబుతూ ఎమోషనల్గా టార్గెట్ చేస్తున్నారు. అంతేకాకుండా తాము జర్నలిస్టులు, అధికారులమని నమ్మిస్తున్నారు. వారిని సొంత ప్రాంతాలకు పంపించాలంటే డబ్బులు కావాలని.. అందుకే జర్నలిస్టులు, ఇతరులకు కాల్స్ చేస్తున్నారు. నిజమే అనుకుని డబ్బులు పంపిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. అందుకే ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.