మునుగోడు నియోజకవర్గంలో ఎక్సైజ్ నిబంధనలకు తోడు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త షరతులు విధించారు. స్థానికులే టెండర్లు వేయాలని, ఊరి బయట షాపులు ఏర్పాటు చేయాలని, పర్మిట్ రూమ్ ఉండకూడదని ఆయన ఆదేశించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధమని, ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని ఆశావహులు చర్చించుకుంటున్నారు.