తెలంగాణ సర్కార్ సింగరేణి కార్మికులకు దసరా పండుగ వేళ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కార్మికులకు భారీగా బోనస్ ప్రకటించింది. గత ఏడాది వచ్చిన లాభాల్లోంచి ఏకంగా 34 శాతం వాటా కార్మికులకే దక్కనుంది. ఒక్కో కార్మికుడికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు బోనస్ కింద అందనుంది.