సింగరేణి కార్మికులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా డబుల్ బొనాంజా లభించనుంది. సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ (PLR) బోనస్ను ఈ నెల 17న అందించనున్నట్లు ప్రకటించింది. ప్రతి కార్మికునికి రూ. 1,03,000 చొప్పున ఈ బోనస్ అందనుంది. దీనికి అదనంగా దసరా పండుగ ఖర్చుల కోసం అడ్వాన్స్ (Advance) కూడా అందిస్తున్నారు. ఒకే నెలలో సింగరేణి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడం వల్ల కార్మికుల కుటుంబాలు సంతోషంగా పండుగలు జరుపుకోనున్నాయి.