సింగరేణి కార్మికుల దశాబ్దాల నాటి 'మారుపేరు' సమస్య పరిష్కారం కానుంది. రూ.1.25 కోట్ల ప్రమాద బీమా, కాంట్రాక్టు కార్మికులకు రూ.40 లక్షల బీమా, కారుణ్య నియామకాల వయోపరిమితి పెంపు వంటి కీలక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి ఆసుపత్రుల ఆధునీకరణ, ఆదాయపు పన్ను రాయితీల పరిశీలన కూడా జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.