సింహాచలం అప్పన్న ఆలయంలో వరుస ప్రమాదాలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా, తొలిపావాంచా వద్ద రేకుల షెడ్డు కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. ఇదివరకు గోడ కూలిన ఘటన మరువకముందే, ఇలా షెడ్డు కూలడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ఆలయంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.