YSRCP Majji Srinu Necklace Donated To Simhachalam Temple: విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సింహాచలం అప్పన్నకు సుమారు 400 గ్రాముల బంగారు పగడాల హారాన్ని సమర్పించారు. ఆయన కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.. ఆ హారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సామాన్య భక్తులకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. మరోవైపు, సింహాచలం క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుండగా, పర్యాటకుల కోసం డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.