Simhachalam Temple Online Darshan Booking: విశాఖపట్నం సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వసతి, దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, విరాళాలు కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల వేచి ఉండే సమయం తగ్గి, ప్రత్యేక క్యూలైన్లు అందుబాటులోకి వస్తాయి. సింహాచలం ఆలయానికి వెళ్లే భక్తులు ఆన్లైన్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఇలాంటి సౌకర్యాలు కల్పించే పనిలో ఉంది.