simhachalam chandanotsavam tickets release: సింహాచలం అప్పన్న భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 20న సింహాచలంలో చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహాచలం అప్పన్న నిజరూప దర్సనం టికెట్ల విక్రయాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకూ ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిజరూప దర్శనం టికెట్లు విక్రయించనున్నారు. ఈసారి 70 శాతం టికెట్లను ఆన్లైన్ ద్వారా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు చందనోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.