ముందున్న పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొన.. దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఈ రైలు అక్టోబర్ 28, 2025 , నవంబర్ 2, 2025 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా.. హజరత్ నిజాముద్దీన్ నుంచి అక్టోబర్ 30, 2025 మరియు నవంబర్ 5, 2025 తేదీలలో తిరుగు ప్రయాణ సదుపాయం కల్పించారు. ఈ తాత్కాలిక సర్వీసులు ఉత్తర భారతానికి వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి.